దొరల పాలన పోతేనే బంగారు తెలంగాణ :   కేఏ పాల్​ 

దొరల పాలన పోతేనే బంగారు తెలంగాణ :   కేఏ పాల్​ 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :  దొరల పాలన పోతేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ పిలుపునిచ్చారు.  శనివారం ఆయన కొత్తగూడెంలో పర్యటించారు.  మీడియాతో మాట్లాడుతూ..  రూ. లక్ష లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్​ రైతులను మోసం చేశారని విమర్శించారు.  

లక్షల కోట్లు అప్పులు చేస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.  300 మంది మృతికి కారణమైన  రైలు ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని తన పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు.