
సీఎం కేసీఆర్ బుధవారం కొండగట్టులో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు ప్రగతిభవన్ నుంచి భవన్ నుంచి బయలుదేరనున్న సీఎం.. 9.05 కి బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 9.10కి అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి 9.40కి కొండగట్టు చేరుకుంటారు. అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. ఒంటి గంటకు కొండగట్టు నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి 1.30కు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రగతి భవన్ వెళ్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.