సిద్దిపేట జిల్లా: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో రోడ్డు దాటడానికి స్కూల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్గల్ మండలంలోని సీతారాంపల్లి, వేలూరు గ్రామాల మధ్య నున్న వాగు భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయం వేలూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు.. సాయంత్రం తిరిగి వెళ్తున్నప్పుడు వాగు ప్రమాదకరంగా ప్రవహించింది.
మోకాలు లోతు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చాలా మంది గ్రామస్తులు గుంపులు గుంపులుగా ఒకరికొకరు చేతులు పట్టుకుని వాగు దాటారు. సీతారాంపల్లి వెళ్లడానికి ఇతర మార్గం లేకపోవడంతో.. విద్యార్థులు గుంపులు గుంపులుగా స్థానికుల సహాయంతో రోడ్డు దాటారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి వేలూరు నుంచి సీతారాంపల్లి వెళ్లే మార్గంలో వాగుపై బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.