తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకుంటున్నడు: జేపీ నడ్డా

తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకుంటున్నడు: జేపీ నడ్డా

దళితబంధులో కూడా బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఈ 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణలో రూ. 5 లక్షల కోట్ల నిధులు ఖర్చు పెట్టిందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే ఉజ్వల్‌ వినియోగదారులకు ఉచితంగా 4 సిలిండర్లు ఇస్తామన్నారు. 

ప్రాంతీయ పార్టీల్లో ఎప్పుడూ వారసులే పదవుల్లో ఉంటారని జేపీ నడ్డా అన్నారు. చేవెళ్లలో బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడం గురించి ఆలోచిస్తుంటారని.. దేశం గురించి, ప్రజల గురించి ఆ ప్రాంతీయ పార్టీలు ఆలోచించవని చెప్పారు. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్‌ భారీగా దోచుకున్నారని జేపీ నడ్డా విమర్శించారు. 

బీజేపీ ప్రభుత్వం ఈ తొమ్మది ఏళ్లలో ఎంత మందికి రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చిందో ఆలోచించాలని సూచించారు. మోదీ పాలనలో భారత్‌ ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని.. తెలంగాణ చరిత్రలో తొలిసారి బీసీ వ్యక్తిని సీఎంగా చేస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు.