
నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ నార్కట్ పల్లిలో పర్యటించారు. తండ్రిని కోల్పోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పరామర్శించారు. లింగయ్య తండ్రి చిరుమర్తి నర్సింహ సంతాప సభకు హాజరైన కేసీఆర్.. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు.