గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

నల్గొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించారు. పీటీఆర్ కాలనీలోని కిషోర్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే తండ్రి మారయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించిన వారిలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య ఇటీవలే గుండెపోటుతో మరణించారు. 

మరిన్ని వార్తల కోసం..

ప్రభుత్వానికి షాక్.. న్యూఇయర్ వేడుకలపై హైకోర్టులో పిటిషన్

పనిచేయలేదు.. నా జీతం కట్ చేయండి