దార్శ‌నికుడు అంబేద్కర్‌

దార్శ‌నికుడు అంబేద్కర్‌

హైదరాబాద్: అణగారిన వర్గాల సామాజిక, ఆర్ధిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. భారత రత్న, రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకుండదనే ఉద్దేశంతో వారికి ఖచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారత జాతి చేసుకున్న అదృష్టమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు.