
తెలంగాణలో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు సీఎం కేసీఆర్. కరోనా లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 59 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో ఒకరు డిశ్చార్జ్ అయ్యారన్నారు. 20 వేల మంది ఇళ్లలో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతుల్లో క్వారంటైన్ లో ఉన్నారని.. శుక్రవారం ఒక్క రోజే 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారుసీఎం కేసీఆర్.