
అధికారులతో సీఎం సమీక్ష
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ లో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌలత్లు చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణంపై ఆయన బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను పరిశీలించి పలు మార్పులు సూచించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కొత్త సెక్రటేరియట్ లో మంత్రులు, సీఎస్, సెక్రెటరీలు, సలహాదారుల చాంబర్స్ కూడా అన్ని సౌకర్యాలతో ఉండాలన్నారు. ప్రతి అంతస్తులో డైనింగ్ హాల్, మీటింగ్ హాల్, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండేలా నిర్మాణం ఉండాలని సూచించారు. కాగా, సెక్రటేరియట్ బిల్డింగ్ను దీర్ఘచతురస్రాకారంలో నిర్మించనున్నట్టు సమాచారం.