కేటీఆర్ చెప్పినా పట్టించుకోని కార్యకర్తలు

కేటీఆర్ చెప్పినా పట్టించుకోని కార్యకర్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 4న సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ తో పాటు, సిరిసిల్ల అర్బన్ మండెపల్లి దగ్గర నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను, సర్దాపూర్ దగ్గర నిర్మించిన మార్కెట్ యార్డ్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు సీఎం. సిరిసిల్ల బైపాస్ రోడ్ లో నిర్మించిన నర్సింగ్ కాలేజ్ ను కూడా సీఎం ప్రారంభిస్తారు. కేసీఆర్ అత్తగారి ఊరైన కొదురుపాకను సందర్శించనున్నారు. అయితే కేసీఆర్ రాక సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో భారీ ఫ్లెక్సీలు, హోర్డింగుల ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ రహితంగా ఉండేందుకు ఫ్లెక్సీలు వద్దని గతంలో పిలుపునిచ్చిన కేటీఆర్ నియోజకవర్గంలోనే నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు.