ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. గ్యారమూర్తి రోడ్లోని ఎస్పీ మార్గ్లో ఉన్న కేత్రి ట్రస్ట్ భవనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏడాదిపాటు లీజుకు తీసుకుంది. కేటీఆర్ ఢిల్లీ టూర్ సందర్భంగా అగ్రిమెంట్ జరిగింది. వసంత్ కుంజ్లో టీఆర్ఎస్ భవన్ నిర్మాణంలో ఉన్నందున బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి.ఈ నెల 5న టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆమోదం కోసం ఈసీకి లేఖ రాయగా..ఈసీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్, మంత్రి తలసాని సహా పలువురు ఉన్నారు. కేసీఆర్ రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు.పలువురు జాతీయ నేతలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.