కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి సమీక్ష

కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి సమీక్ష

కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 2గంటల నుండి ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించ‌నున్నారు. 2020 – 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష జరుపుతారని సీఎం అధికారిక కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ జరుపుతారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొంటారు. సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది.

అదే విధంగా యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై కూడా ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం 4గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వైటిడిఎ(YTDA) స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు.నిర్మాణ పనుల్లో పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షిస్తారు