అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలే: మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి

అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలే:   మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి

సిరికొండ, వెలుగు: భూమిలేని పేదలకు భూములు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్, మాట నిలబెట్టకోలేదని మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆరోపించారు. సిరికొండ మండలంలోని కొండాపూర్, గడ్డమీది తండా, ముషీర్​నగర్​గ్రామాల్లోని పోడు భూములను పరిశీలించి రైతులతో మాట్లాడారు. బీఆర్ఎస్​అధికారంలోకి వచ్చి 9 ఏండ్లు గడిచినా, ఇంత వరకు  చేసిందేమీ లేదన్నారు.30 ఏళ్ల నుంచి పోడు భూముల్లో సాగు చేస్తున్నవారికి పట్టాలివ్వకపోవడం దారుణమన్నారు. 

వేలల్లో దరఖాస్తులు చేసుకుంటే, వందల మందికి పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని వాపోయారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పోడు పట్టాలిస్తామన్నారు. కాశీతండా, ముషీర్​నగర్ గ్రామాల్లోని పలువురు మహిళలు భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు. కార్యక్రమంలో జిల్లా కారద్యర్శి భాస్కర్​రెడ్డి, మండలాధ్యక్షుడు రవి, యూత్​ ప్రెసిడెంట్​భూషణ్, రమేశ్, జావీద్, మల్లేశ్​తదితరులు
 పాల్గొన్నారు.