- సీఎం పీఆర్వో రాజీనామా
- ట్రాన్స్కో జీఎం పోస్టుకూ రిజైన్
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ పీఆర్వో గటిక విజయ్కుమార్ రాజీనామా చేశారు. పీఆర్వోతోపాటు ట్రాన్స్కో జీఎం (కమ్యూనికేషన్)గా కొనసాగుతున్న ఆయన ఆ ఉద్యోగానికి కూడా రిజైన్ చేశారు. కొంతకాలంగా ఆయన వ్యవహారశైలిపై ఫిర్యాదులు రావడంతో సీఎం కేసీఆర్ రాత్రికిరాత్రి ఆయనతో రాజీనామా చేయించారని ప్రగతిభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎంవో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించలేదు. ట్రాన్స్కో జీఎం పోస్టుకు విజయ్కుమార్ రిజైన్ చేసిన విషయాన్ని ట్రాన్స్కో ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. మరోవైపు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు విజయ్కుమార్ బుధవారం ఉదయమే ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుగా పనిచేసిన విజయ్ కుమార్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం పీఆర్వోగా జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి మీడియా వ్యవహారాల్లో కేసీఆర్కు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.
