
- గవర్నర్కు ఉత్సవ కమిటీ ఆహ్వానం
ఖైరతాబాద్, వెలుగు : ఖైరతాబాద్లోని శ్రీ సప్త ముఖ మహా శక్తి గణపతి పూజకు హాజరు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఖైరతాబాద్గణేశ్ఉత్సవ అడహాక్ కమిటీ ఆహ్వానం పలికింది. బుధవారం రాజ్భవన్కు వెళ్లిన కమిటీ ప్రెసిడెంట్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చైర్మన్ రాజ్కుమార్ ఆధ్వర్యంలోని బృందం గవర్నర్కు ఆహ్వాన పత్రిక అందజేసింది. అడహక్ కమిటీ సభ్యులు లక్ష్మణ్యాదవ్, జి.కృష్ణయాదవ్, మహేశ్ యాదవ్, అశోక్, మహేందర్బాబు, పృథ్వీరాజ్ ఉన్నారు.
బాలాపూర్ గణేశ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత : సీపీ సుధీర్బాబు
ఎల్బీనగర్ : బాలాపూర్ వినాయకుడి మండపం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. సీఎం ఆదేశాలతో సీసీ కెమెరాలు, భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక పార్కింగ్ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఆయన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, బాలాపూర్ సీఐ, బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ పారిజాతనర్సింహారెడ్డి బాలాపూర్ గణేశ్ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లం నిరంజన్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మండపం వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.