
హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రభుత్వం కొలువుల పండుగ కార్యక్రమం నిర్వహించింది. శనివారం (అక్టోబర్ 18) నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రూప్ 2 కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితర నాయకులు, అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు జాబ్ లెటర్స్ అందజేశారు సీఎం.
సీఎం రేవంత్ స్పీచ్ ముఖ్యాంశాలు:
- తెలంగాణ పునర్ణిర్మాణంలో 783 మంది భాగస్వాములు కాబోతున్నారు
- దీపావళి సందర్భంగా మీ తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపాం
- ఉద్యోగం అంటే భావోద్వేగం..
- ఉద్యోగులు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి
- లేదంటే వారి జీతంలో నుంచి 15 శాతం తల్లిదండ్రుల ఖాతాలో వేస్తాం
- అందుకోసం కొత్త చట్టం తెస్తాం
- అనేక మంది బలినాదాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
- తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మబలిదానం చేసుకున్నారు
- ఏ రోజు కూడా రాష్ట్ర యువత గురించి గత ప్రభుత్వం ఆలోచించలేదు
- ఆ కుటుంబ సభ్యులు మాత్రమే లబ్ది పొందారు.
- కేసీఆర్ తన కుటుంబంలో ఉన్న అన్ని ఖాళీలలను నింపుకున్నారు.
- గత 15 ఏళ్ల పాటు గ్రూప్ 1 నియామకాలు జరపలేదు
- నిరుద్యోగుల గురించి ఏ నాడు ఆలోచించలేదు
- గ్రూప్1, గ్రూప్ 2 నియామకాల విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి
- అయినప్పటికీ సమర్ధవంతంగా పూర్తిచేశాం.
- త్వరలోనే గ్రూప్ 3, 4 నియామకాలు జరిపి ఉద్యోగాలు ఇస్తాం
- గతంలో TSPSC లో ఉన్నవాళ్లు, ఇప్పుడు ఉన్న వాళ్లు ఎవరో గుర్తించండి
- కాళేశ్వరం కట్టడం, కూలడం మూడేళ్లలోనే జరిగిపోయింది
- దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి దుర్ఘటన జరగలేదు
- వరి పంట వేస్తే ఉరి అన్నారు
- ఫామ్ హౌస్ లో పడుకుని ఎకరాకు కోటి పండిస్తున్నట్లు చెప్పారు
- ఆ కళను ప్రజలకు ఎందుకు చెప్పలేదు
- దేశంలో ఎక్కడా జరగని విధంగా కుల సర్వే చేశాం
- మా ఒత్తిడితోనే కేంద్రం దిగొచ్చింది.. జనగణనలో కులగణన చేసేలా ఒత్తిడి తెచ్చాం
- మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరు
- చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని..
- గ్రూప్ 1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం.
- ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
- గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి..
- అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు
- అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు
- ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్
- మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి..
- రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేయాలి
- దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి
- రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు
- నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి
- గత పాలకుల పాపాల పుట్ట కదులుతోంది
- వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు
- హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు
- సెంటిమెంట్ తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు.
- అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగ ఉండాలి
- ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్ తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి
- సమర్ధవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలి