కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ :  సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: లోక్‌‌‌‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి సంబంధించిన జాతీయ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై రాష్ట్ర కాంగ్రెస్  ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం పీసీసీ చీఫ్, సీఎం రేవంత్​రెడ్డి గురువారం ఓ కమిటీని ప్రకటించారు.

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్‌‌‌‌గా, పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య కన్వీనర్‌‌‌‌గా ఏడుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎ.శ్యామ్ మోహన్, బి.కమలాకర్ రావు, బీ.ఎం. వినోద్ కుమార్, మహ్మద్ రియాజ్, బి.జనక్ ప్రసాద్‌‌‌‌ను సభ్యులుగా ప్రకటించారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను రాష్ట్రంలో క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఈ కమిటీ అధ్యయనం చేసి 15రోజుల్లో పీసీసీకి నివేదికను అందజేయనుంది.