- పాలమూరు సభలో ప్రకటించిన సీఎం
మహబూబ్నగర్, వెలుగు: పాలమూరు స్థాని క సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థిగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, ఎంఎస్ఎన్ ఫార్మా డైరెక్టర్ మన్నె జీవన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బుధవారం మహబూబ్నగర్ టౌన్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేసిన పనులకు బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ‘‘మీరు జీవన్రెడ్డిని గెలిపిస్తే.. రాష్ట్రానికి, జిల్లాకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ఆయన మంజూరు చేయిస్తారు” అని సీఎం హామీ ఇచ్చారు.