రాహుల్ గాంధీపై బీజేపీ గూండాల దాడిని ఖండిస్తున్నా

రాహుల్ గాంధీపై  బీజేపీ గూండాల దాడిని ఖండిస్తున్నా

అసోంలో రాహుల్ గాంధీ కాన్వాయ్ పై దాడిని ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి మంచిది కాదన్నారు. భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ కాన్వాయ్ పై  స్థానిక బీజేపీ స్పాన్సర్డ్ గూండాల  దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, ఇవాళ గుడి సందర్శనకు అనుమతివ్వకపోవడం శోచనీయమన్నారు రేవంత్.

రాహుల్ భద్రత విషయంలో సైతం అసోం  ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు రేవంత్. ఇలాంటి చర్యలతో ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ఫలించవన్నారు. మరింత మనోధైర్యంతో రాహుల్ ముందుకు సాగుతారు.. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అండ .. ఈ దేశ ప్రజల మద్ధతు రాహుల్ కు ఉందన్నారు. తెలంగాణ సమాజం కూడా రాహుల్ గాంధీకి అండగా ఉందన్నారు.  ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు అండగా, పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ తలపెట్టిన యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుంది.