కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద గత కేసీఆర్ ప్రభుత్వం లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేదని సీఎం రేవంత్ అన్నారు. కోటి ఎకరాలకు నీరిచ్చామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ప్రతి సారి అబద్దాలు చెప్పారన్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన డిజైన్ ప్రకారం పూర్తి కావాలంటే ఇంకా 2 లక్షల కోట్లు అవసరమవుతుందన్నారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టిన గత ప్రభుత్వం .. కనీసం లక్ష ఎకరాలకు నీరివ్వలేదన్నారు. కోటి ఎకరాలకు నీరిచ్చానని కేసీఆర్ పదే పదే అబద్దాలు చెప్పారన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిందన్నారు. గత ప్రాజెక్ట్ లు నిర్వహణ లోపం వల్ల కుంగిపోయిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ అక్కరకు రాకుండా పోయిందని సీఎం రేవంత్ అన్నారు.
అధికారిక లెక్కల వివరాలు
- కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే కొత్తగా 19 లక్షల 63 వేల ఎకరాల ఆయకట్టు
- ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు 94 వేల కోట్లు
- ఇప్పటివరకు 95 వేల 570 ఎకరాలకు నీరు
- ఏడాదికి కరంట్ బిల్లు 10 వేల 500 కోట్లు
- ఏడాదికి ఇతర ప్రాజెక్టులు, నిర్వహణ 25 వేల కోట్లు ఖర్చు
- కొత్త అంచనాలప్రకారం 2 లక్షల కోట్లు అవసర