నవంబర్ 24న కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి

నవంబర్ 24న కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి
  •     గ్రీన్​ ఫీల్డ్​ కిచెన్​ నిర్మాణానికి భూమిపూజ
  •     ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

కొడంగల్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి ఈ నెల 24న కొడంగల్​లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొడంగల్‌‌‌‌ శివారులోని ఎన్కేపల్లిలో  నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్​కు సీఎం భూమి పూజ  చేయనున్నారు. 

అలాగే దుద్యాల మండలం హకీంపేటలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్​కారిడార్, ఎడ్యకేషనల్​హబ్​ను పరిశీలిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వికారాబాద్ జిల్లా కలెక్టర్​ప్రతీక్​జైన్, ఎస్పీ నారాయణరెడ్డి కలిసి గురువారం పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తుపై చర్చించారు. అసిస్టెంట్​ కలెక్టర్​హర్ష్​చౌదరి, కడా స్పెషల్​ఆఫీసర్​ వెంకట్​రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్​ ఉన్నారు.