అక్టోబర్ 15న హన్మకొండకు సీఎం రేవంత్రెడ్డి

అక్టోబర్ 15న  హన్మకొండకు సీఎం రేవంత్రెడ్డి
  • నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి పరామర్శ

వరంగల్/నర్సంపేట, వెలుగు: హన్మకొండకు బుధవారం సీఎం రేవంతరెడ్డి రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించిన సమాచారం జిల్లా అధికార యంత్రాంగానికి అందింది. వరంగల్​ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ ఈ నెల 4న చనిపోగా, ఆమె దశదిన కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్​  నుంచి సీఎం హెలికాప్టర్​లో రానున్నారు. 

హన్మకొండలోని ఆర్ట్స్​ అండ్​ సైన్స్​ కాలేజీకి మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వడ్డేపల్లి పీజీఆర్​ గార్డెన్​కు వెళ్లి దొంతి కాంతమ్మకు నివాళులర్పించి, ఎమ్మెల్యేతో పాటు ఆయన ఫ్యామిలీని పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్​కు వెళ్తారు. మంగళవారం వరంగల్​ సీపీ సన్​ప్రీత్​సింగ్​ ఏర్పాట్లను పరిశీలించారు.