ఆస్పత్రిలో అన్నను పరామర్శించిన సీఎం రేవంత్రెడ్డి

ఆస్పత్రిలో అన్నను పరామర్శించిన  సీఎం రేవంత్రెడ్డి
  • సోదరుడు తిరుపతిరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్: గుండెపోటుతో మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరుడు తిరుపతి రెడ్డిని పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. తిరుపతి రెడ్డ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి. గురువారం తిరుపతిరెడ్డి కి గుండె పోటు రావడంతో చికిత్స కోసం మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. తిరుపతిరెడ్డికి యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు.. గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించారు. వెంటనే ఆయను స్టంట్స్ వేశారు. ప్రస్తుతం తిరుపతి రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

ALSO READ :- NBK 109 Glimpse: సింహం నక్కల మీదకు వస్తే.. వార్ అవ్వదురా లఫూట్..ఇట్స్ హంటింగ్

రానున్న రోజుల్లో లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అయిన తిరుపతిరెడ్డి పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ తిరుపతిరెడ్డి పేరుతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలను తిరుపతి రెడ్డి చూసుకుంటున్నారు.