మేము ప్రతిపక్షంలో ఉన్నా.. ఇలాంటి బూతులు తిట్టలే

మేము ప్రతిపక్షంలో ఉన్నా.. ఇలాంటి బూతులు తిట్టలే

ఏపీలో ప్రతిపక్ష టీడీపీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని విమర్శించారు. ప్రతిపక్షం ఎలా తయారైందో ప్రజలు చూస్తున్నారని తెలిపారు. బూతులు తిడుతూ ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి బూతులు ఎప్పుడూ మాట్లాడలేదన్నారు జగన్. టీడీపీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అమరావతి క్యాంప్ ఆఫీస్ లో జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్  ఖాతాల్లో జమ చేశారు సీఎం. అంతకుముందు వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు నివాళులర్పించారు జగన్.