అన్ని అసెంబ్లీ సీట్లు స్వీప్ చేయాలి

అన్ని అసెంబ్లీ సీట్లు స్వీప్ చేయాలి

వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175 కి 175 సీట్లు గెలవాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అమరావతి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో వర్క్ షాపు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ సీట్లు క్లీన్ స్వీప్ చేయడమే తమ లక్ష్యంగా పనిచేయాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం నిరంతర కార్యక్రమమని నేతలకు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతీ నెల వర్క్ షాప్ నిర్వహిస్తామని చెప్పారు. ఎక్కువ రోజులు ప్రజల్లో ఉండాలని సీఎం జగన్ ను కోరారు ఎమ్మెల్యేలు. క్షేత్ర స్థాయిలో పర్యటించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ టీం ప్రజంటేషన్ ఇచ్చింది.