- మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: ఆపదలో పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో అండగా ఉంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
బుధవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అమీన్పూర్ డివిజన్కు చెందిన అనసూయకు రూ.60 వేలు, గుమ్మడిదల మండలానికి చెందిన సీహెచ్ శ్రీనివాస్కు రూ.47,500, చిట్కుల్ గ్రామానికి చెందిన సంగన్నగారి మహేశ్కు రూ.60 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయానికి వైద్యం అందక అప్పులపాలవుతున్న వారిని ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆదుకుంటోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
