- దేశంలోని 8 బొగ్గు కంపెనీల క్రీడాకారులు రాక
- కొత్తగూడెంలో మూడు రోజుల పాటు నిర్వహణ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కోల్ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు కొత్తగూడెంలో శుక్రవారం షురూ కానున్నాయి. కోల్ఇండియా ఇంటర్కంపెనీ లెవల్కబడ్డీ పోటీలు ఈనెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజులు నిర్వహిస్తారు. కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్లోని జయశంకర్ గ్రౌండ్లో పోటీలు జరగనున్నాయి. సింగరేణితో పాటు బీసీసీఎస్, సీసీఎల్, ఈసీఎల్, ఎంసీఎల్, ఎన్సీఎల్, ఎస్ఈసీఎల్, డబ్ల్యూసీఎల్ కంపెనీల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు.
దేశం లోని పలు బొగ్గు పరిశ్రమల నుంచి కార్మిక క్రీడాకారులు తరలివస్తుండడంతో అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించేందుకు కబడ్డీ కోర్టులు సిద్ధమయ్యాయి .రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కలిగిన అంపైర్లను ఆహ్వానిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలను సింగరేణి అధికారులు కల్పిస్తున్నారు.
