- రన్నరప్గా సింగరేణి జట్టు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీల్లో వెస్ట్రన్కోల్ఫీల్డ్ (డబ్ల్యుసీఎల్) కబడ్డీ జట్టు రికార్డు సృష్టించింది. 26వ సారి విజేతగా నిలిచి తన రికార్డును నిలబెట్టుకుంది. కొత్తగూడెం ఏరియాలో ఆదివారం సింగరేణి జట్టుతో జరిగిన ఫైనల్మ్యాచ్లో డబ్ల్యుసీఎల్విజయం సాధించింది. మూడు రోజులుగా జరిగిన కబడ్డీ పోటీలు ఆదివారం ముగియగా.. సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్లు ఎం. తిరుమల రావు, ఎల్వీ సూర్యనారాయణ విజేతలకు బహుమతులు అందించారు.
రన్నరప్గా సింగరేణి జట్టు నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రోగ్రామ్ లో ఏరియా జీఎం షాలెం రాజు, గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్వర్కర్స్యూనియన్అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ సీనియర్వైస్ ప్రెసిడెంట్త్యాగరాజన్, సీఎంఓఏఐ ఏరియా ప్రెసిడెంట్ ఎంవీ నర్సింహరావు, జీఎంలు జీవీ కిరణ్కుమార్, ఎం. సుబ్బారావు, ఎస్వోటూజీఎం జీవీ కోటిరెడ్డి, యూనియన్ నేతలు మల్లికార్జున్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.
