భవనం కూల్చివేత.. బిల్డర్​పై కేసు

భవనం కూల్చివేత.. బిల్డర్​పై కేసు

జీడిమెట్ల, వెలుగు : నిజాంపేట కార్పొరేషన్​పరిధి ప్రగతినగర్​ఎన్ఆర్ఐ కాలనీలో కుప్పకూలిన బిల్డింగ్​ను  టౌన్ ​ప్లానింగ్ అధికారులు గురువారం కూల్చివేశారు. బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో  టౌన్​ప్లానింగ్​అధికారుల బిల్డింగ్​ కూల్చివేతలు చేపట్టారు.  అధికారుల ఫిర్యాదుతో బిల్డర్స్​పై  బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.