
భారీ వర్షాలతో జనగామ జిల్లా ఖిలా షాపూర్లోని సర్దార్ సర్వాయి పాపన్న కోట కుప్ప కూలింది. గోల్కొండ కోటను జయించిన తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోట నేల మట్టమైంది. ఆయన స్వస్థలం అయిన జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాశాపూర్ గ్రామంలోని కోట ఇటీవలే వర్షాలకు బీటలు వారింది. అయినా ఎవరూ పట్టించుకోక పోవడంతో ఉదయం కొంత భాగం కూలి పోయింది. అదృష్ట వశాత్తూ ఎవరికి ప్రమాదం జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా మన చారిత్రక కట్టడాలను ప్రభుత్వం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు . గత ఆరు ఏళ్ల నుంచి ఒక్కరు కూడా కోట నిర్వహణను పట్టించుకోలేదంటున్నారు. 350 ఏళ్ల నాటి కోట కూలడంతో గ్రామస్తులు, జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.