నిర్మల్ జిల్లా ఫ్లడ్ మాన్యువల్ 2025 పుస్తకం ఆవిష్కరణ

నిర్మల్ జిల్లా ఫ్లడ్ మాన్యువల్ 2025 పుస్తకం ఆవిష్కరణ

నిర్మల్, వెలుగు: వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్​లో నిర్మల్ జిల్లా ఫ్లడ్ మాన్యువల్–2025 పుస్తకం ఆవిష్కరించారు. గతేడాది జిల్లాలో వరదల తీవ్రత, జరిగిన ఆస్తి, పంట నష్టం  సమాచారం ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు.

ఈసారి వానాకాలం నేపథ్యంలో  తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, పునరావాస ఏర్పాట్లు వంటి అంశాలున్నాయన్నారు. అడిషనల్​కలెక్టర్(రెవెన్యూ) కిశోర్ కుమార్, ముఖ్య ప్రణాళికాధికారి జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రుల్లో అధిక చార్జీలు వసూలు చేయొద్దు

నిర్మల్ జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్ యాక్ట్ –2010 నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్​హాస్పిటల్స్​లో పేషెంట్ల వద్ద నుంచి అధిక చార్జీలు వసూలు చేయొద్దని చెప్పారు. లింగ నిర్ధారణ చేసేవారిపై నిఘా పెట్టాలన్నారు.

దీనిపై సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 7337448722 ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. అనంతరం పీసీ అండ్​పీఎన్​డీటీ చట్టం, అమ్మ రక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎంహెచ్​వో రాజేందర్, వైద్యులు ‌పాల్గొన్నారు.