కామారెడ్డిలో భూభారతి అప్లికేషన్లు వారంలో పరిష్కరించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డిలో భూభారతి అప్లికేషన్లు వారంలో పరిష్కరించాలి :  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : భూభారతి పెండింగ్ అప్లికేషన్లను వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్​లో జిల్లా అధికారులు,  గాంధారి, బిచ్​కుంద, లింగంపేట తహసీల్దార్లతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు.  కొన్ని ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు విముక్తి కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి పోర్టల్​ను తీసుకొచ్చిందన్నారు. 

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించి భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి రైతుల సమస్యలు తీర్చాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్, సబ్​ కలెక్టర్ కిరణ్మయి,  ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి,  ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, అధికారులు పాల్గొన్నారు.