మొబైల్ కంటి శస్త్రచికిత్స శిబిర పోస్టర్‌‌ ను ఆవిష్కరించిన కలెక్టర్

మొబైల్ కంటి శస్త్రచికిత్స శిబిర పోస్టర్‌‌ ను ఆవిష్కరించిన కలెక్టర్

ఏటూరునాగారం, వెలుగు: ఏటూరునాగారంలో ఈ నెల 22 నుంచి 30 వరకు నిర్వహించే మొబైల్ కంటి శస్త్రచికిత్స శిబిరం పోస్టర్‌‌ ను ములుగు కలెక్టర్ దివాకర్ కలెక్టరేట్​లో బుధవారం ఆవిష్కరించారు. మండలంలోని రోహీర్​ గ్రామానికి చెందిన సినీ యాక్టర్ సంజోష్ స్థాపించిన సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపేంద్ర రాచుపల్లి, శిల్పా సహకారంతో ఏటూరునాగారం గిరిజన్ భవన్ వద్ద సంజోష్ ఫౌండేషన్, శంకర నేత్రాలయ సంయుక్తంగా  నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ కోరారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ మహేందర్​ జీ, డీఎంహెచ్​వో గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.