ఎస్ఎస్ టీ శిబిరాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఎస్ఎస్ టీ శిబిరాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

బెజ్జంకి, వెలుగు: మండలంలోని దేవక్కపల్లి మీదుగా వెళ్లే రాజీవ్ రహదారిపై  ఏర్పాటు చేసిన ఎస్ఎస్ టీ (స్టాటిస్టికల్​సర్వైలెన్స్​ టీం) శిబిరాన్ని కలెక్టర్ హైమావతి ఆదివారం తనిఖీ చేశారు. రిజిస్టర్​ను తనిఖీ చేసి మాట్లాడారు.  ప్రతీ వాహనాన్ని క్షుణంగా పరిశీలించి వీడియో చిత్రీకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్​సీని కేంద్రాన్ని సందర్శించారు.

 రోగులకు అందించే వైద్య సేవలను పరిశీలించారు.  స్టాఫ్ నర్స్ పద్మ తప్ప సిబ్బంది సెలవులపై వెళ్లడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు ఏ విధంగా అందిస్తారని ప్రశ్నించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.