నేషనల్జియో స్పేషియల్ .. ప్రాక్టీషనర్ అవార్డు అందుకున్న కలెక్టర్ జితేశ్

నేషనల్జియో స్పేషియల్ .. ప్రాక్టీషనర్ అవార్డు అందుకున్న కలెక్టర్ జితేశ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బాంబేలో గురువారం జరిగిన ప్రోగ్రాంలో నేషనల్​జియో స్పేషియల్​ ప్రాక్టీషనర్​అవార్డుతో పాటు జీఐఎస్​ కో హార్ట్​ అవార్డును ఇస్రో మాజీ చైర్మన్​ ఏఎస్.కిరణ్​ కుమార్ కలెక్టర్​జితేశ్ కుమార్​​కు అందజేశారు. ఎఫ్​ఓఎస్​ఎస్​ఈఈ, ఐఐటీ బాంబే, భారత ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రోగ్రాంలో ఈ అవార్డులను కలెక్టర్​ అందుకున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం చూపిన చొరవ, జియో స్పేషియల్​ టెక్నాలజీ నిపుణులతో కలిసి ఓపెన్​ సోర్స్​ జీఐఎస్​ సదస్సు నిర్వహణతో పాటు ఈ టెక్నాలజీలో స్టూడెంట్స్ ను, అధికారులను భాగస్వాములుగా చేశారు. 

దేశంలో మొట్టమొదటి ఓపెన్​ సోర్స్​ జీఐఎస్​ కోహార్ట్​ను భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయడంలో కలెక్టర్​ చొరవ చూపారు. గోదావరి వరదల టైంలో ముంపు గ్రామాల గుర్తింపుతో పాటు రైతులను మునగ సాగు వైపు మారుస్తూ స్వయం సమృద్ధి వైపు నడిపించడం లాంటి పలు కార్యక్రమాలకు గానూ ఈ అవార్డును అందజేశారు. జీఐఎస్​ ఆథారిత వ్యవస్థలను మరింతగా జిల్లాలో విస్తరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్​ పేర్కొన్నారు.