భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ క్రాంతి

భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ క్రాంతి
  • కలెక్టర్ క్రాంతి  

కొండాపూర్, వెలుగు: రెవెన్యూ సదస్సులకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొండాపూర్ మండలంలోని గొల్లపల్లిలో నిర్వహించిన సదస్సులో ఆమె  పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ,  దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు సమర్పించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని, ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని డేటాఎంట్రీ ఆపరేటర్లకు సూచించారు.

 ప్రతి దరఖాస్తును పరిశీలించి విచారణ జరిపి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. భూభారతి చట్టంలో పొందుపర్చిన మార్గదర్శకాల ప్రకారం సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కొండాపూర్ తహసీల్దార్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సులకు వచ్చిన దరఖాస్తుల ఆన్​లైన్​ప్రక్రియ ను పరిశీలించారు. కలెక్టర్​వెంట ఆర్డీవో రవీందర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.