
- కలెక్టర్ కుమార్ దీపక్
- లక్సెట్టిపేటలో ప్రభుత్వ స్కూల్, కాలేజీ కొత్త భవనం ప్రారంభం
లక్సెట్టిపేట, వెలుగు: చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. లక్సెట్టిపేట మండల కేంద్రంలో రూ.12 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కాలేజీల నూతన భవనాలను గురువారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు సర్కారు దృఢ నిశ్చయంతో ఉందన్నారు.
ప్రభుత్వం విద్య, వైద్యం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. పట్టణంలో కార్పొరేట్ కు దీటుగా భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్కూల్, కాలేజీని నిర్మించామని తెలిపారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉందన్నారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, డీఆర్డీవో కిషన్, డిప్యూటీ సెక్రటరీ యాదగిరి, డీఈవో యాదయ్య, డీఐఈవో అంజయ్య, కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, స్కూల్హెచ్ఎం వేణుగోపాల్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.