మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  • రెవెన్యూ విలేజ్​ ప్రొఫైల్​తయారు చేయండి: కలెక్టర్ హైమావతి 

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్​రాహుల్​రాజ్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని చిల్డ్రన్స్ పార్క్, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఏరియా, వివిధ వార్డుల్లో  విస్తృతంగా పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ..అభివృద్ధి పనుల ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ మహేశ్, ఏఈ నితిన్,  సంబంధిత అధికారులు ఉన్నారు.  

ఆధార్​నమోదుకు స్పెషల్​డ్రైవ్​

జులై నుంచి ఆధార్ నమోదు, జనన ధ్రువీకరణ పత్రాల మంజూరుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆధార్ మానిటరింగ్ కమిటీతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆధార్  నమోదు ప్రక్రియలో ఎదుర్కొంటున్న లోపాలు, ఆధార్ ధ్రువీకరణ గురించి చర్చించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ నగేశ్, డీఆర్​వో రాధాకిషన్​, ఏఎస్పీ మహేందర్​, డీడబ్ల్యూవో హైమావతి, డీఎం హెచ్​వో శ్రీరామ్​, డీపీవో యాదయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

కాలేజీకి మూడు గదులు కేటాయింపు

శివ్వంపేట: ప్రభుత్వ జూనియర్ కాలేజీకి ఉన్నత పాఠశాలలోని 3 గదులను కేటాయిస్తున్నట్లు డీఈవో రాధాకిషన్ తెలిపారు. శివ్వంపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి సొంత భవనం లేక స్టూడెంట్స్​ఇబ్బందులు పడుతున్న విషయం కలెక్టర్ రాహుల్ రాజ్ దృష్టికి వెళ్లడంతో ఆరు రోజుల కింద స్కూల్​గదులు పరిశీలించి వెళ్లారు. మంగళవారం డీఈవో రాధాకిషన్ ఉన్నత పాఠశాలను పరిశీలించి జూనియర్ కాలేజీ తరగతుల బోధనకు మూడు గదులు కేటాయించారు. ఆయన వెంట ఎంఈవో బుచ్చనాయక్, ప్రిన్సిపాల్ శైలజ, హెచ్ఎం బాలచంద్రం, హస్టల్ వార్డెన్ యాదగిరి 
ఉన్నారు.

రెవెన్యూ విలేజ్​ ప్రొఫైల్ ​తయారు చేయండి

కొండపాక, వెలుగు: భూ యాజమానుల వివరాలతో రెవెన్యూ విలేజ్ ప్రొఫైల్ తయారు చేయాలని కలెక్టర్ హైమవతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కొండపాక మండలం అంకిరెడ్డిపల్లిలో జరిగిన భూ భారతి రెవెన్యూ సదస్సును అడిషనల్​కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలసి సందర్శించారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కరించడం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్, ఆర్ఐ బాలకృష్ణ, అధికారులు సువర్ణ, భాస్కర్ రెడ్డి, శివ ప్రసాద్ పాల్గొన్నారు.