ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి : కలెక్టర్​ రాహుల్​ రాజ్​

ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి : కలెక్టర్​ రాహుల్​ రాజ్​
  •     మెదక్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాహుల్​ రాజ్

మెదక్​టౌన్​, వెలుగు :  పార్లమెంట్​ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని అన్ని చెక్​పోస్టుల వద్ద ఎస్​ఎస్​టీ బృందాలు అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని తప్పకుండా తనిఖీ చేయాలని మెదక్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాహుల్​రాజ్​ అన్నారు.  బుధవారం మెదక్​ జిల్లా పరిధిలోని చిన్నశంకరంపేట, రామాయంపేట మండలంలోని అక్కన్నపేట వద్ద ఏర్పాటు చేసిన ఎస్​ఎస్​టీ టీమ్​ పోలీస్​ చెక్​పోస్టును మెదక్​ ఆర్డీవో రమాదేవితో కలిసి పరిశీలించారు

ఈ సందర్భంగా కలెక్టర్​ రాహుల్​రాజ్​అక్కడున్న వారికి పలు సలహాలు, సూచనలు చేసి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్​ రాహుల్​రాజ్​ మాట్లాడుతూ.. ప్రతి వాహనాన్ని కచ్చితంగా తనిఖీ చేయాల్సిందిగా సూచించారు. చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు 24 గంటలు పని చేసేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.