మెదక్ టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా బాల్యవివాహాలు, డ్రగ్స్ నిర్మూలన, పోక్సో చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి బాలల హక్కులను రక్షించాలన్నారు.
డ్రగ్స్ నిరోధకం, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించి యువతీ యువకులు సన్మార్గం వైపు నడిచేలా ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, ఆర్డీవో రమాదేవి, డీడబ్ల్యూవో హేమభార్గవి, మహమ్మద్ అహ్మద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
