
సిద్దిపేట రూరల్, వెలుగు: అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్రాహుల్రాజ్హెచ్చరించారు. మంగళవారం ఆమె నారాయణరావు పేట మండల కేంద్రంలో పర్యటించారు. పీహెచ్సీని సందర్శించి అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేసి మెడికల్ ఆఫీసర్ బాపు రెడ్డి లీవ్ లో ఉన్నట్లు తెలపగా డీఎంహెచ్వోతో ఫోన్ మాట్లాడారు. సమయానికి విధులకు హాజరుకాని సిబ్బందికి ఆబ్సెంట్ వేసి జీతం కట్ చెయ్యాలని డీఎంహెచ్వోను ఆదేశించారు.
మండల కేంద్రంలో నిర్వహిస్తున్న డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించి ప్రతి ఇంట్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ లో భాగంగా మొదటి ప్రతిమను కలెక్టర్ కు అందజేశారు.