శ్రమ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి : రాజర్షి షా

శ్రమ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి : రాజర్షి షా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: జిల్లాలోని ఐటీడీఏ గిరిజన ఆశ్రమ పాఠశాల్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్​మీటింగ్​హాల్​లో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తాతో కలిసి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల ప్రధానోపాధ్యాయులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.  నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. పెండింగ్ పనులు, మరమ్మతులు ఏమైన ఉంటే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.