నామినేషన్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : రాజర్షి షా

నామినేషన్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : రాజర్షి షా

 మెదక్ టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్​లో పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల  ప్రక్రియను సీసీ కెమెరాల సమక్షంలో నిర్వహించాలని, అభ్యర్థుల వ్యయ వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు.

నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసే వారితో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతించాలన్నారు. 11 గంటలకు ముందు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్లు స్వీకరించొద్దని, నామినేషన్ల స్క్రూటీని ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనే సమాచారం అభ్యర్థులకు తెలియజేయాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్​, డీఆర్​వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో వెంకట శైలేశ్​, ఆర్డీవోలు అంబదాస్​ రాజేశ్వర్,  జయచంద్ర,  శ్రీనివాస్ 
పాల్గొన్నారు.

వాల్మీకి ఆలోచన విధానం ఎంతో గొప్పది 

 వాల్మీకి సమాజానికి ఎంతో విలువైన గ్రంథాలను అందించారని.. ఆయన ఆలోచనా విధానం ఎంతో గొప్పదని కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శంకర్, సహాయ అభివృద్ధి అధికారి నాగరాజు గౌడ్,  కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.