
ముస్తాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లతో పేదవారి సొంతింటి కల నెరనుందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. ఆదివారం ముస్తాబాద్ మండలకేంద్రంలో 491 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను కేకే మహేందర్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోనున్న నిరుపేదలకు పెట్టుబడికి డబ్బు లేకపోతే మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష లోన్ ఇప్పిస్తామన్నారు. పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసినట్లు చెప్పారు.
ఎవరైనా డబ్బులు అడిగితే నాకు ఫోన్ చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని, కేవలం రవాణా చార్జీలు భరించాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, హౌసింగ్ పీడీ శంకర్, డీఆర్డీవో శేషాద్రి, ఎంపీడీవో బీరయ్య, తహసీల్దార్ సురేశ్, అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.