అంగన్​వాడీలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి : తేజస్ నందలాల్ పవార్

అంగన్​వాడీలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి  : తేజస్ నందలాల్ పవార్
  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

సూర్యాపేట, వెలుగు : జిల్లాలోని అంగన్​వాడీలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6 ప్రాజెక్టులు ఉన్నాయని, ప్రాజెక్టుకు ఒక్క అంగన్​వాడీ కేంద్రాన్ని ప్రైవేట్ ప్లే స్కూల్ కు దీటుగా తీర్చేదిద్దేందుకు ఒక్కో సెంటర్ కు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.12 లక్షలు మంజూరు చేస్తామన్నారు. 

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఈ పనులు చేపట్టాలని సూచించారు. వీటితోపాటు అంగన్ వాడీ సెంటర్లకు తాగునీరు, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. బడిబాట కార్యక్రమంతోపాటు అంగన్​వాడీ కేంద్రాల్లో విద్యార్థులు చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. మంచి ఆక్టివిటీస్ చేసిన టీచర్లకు జిల్లాలో ముగ్గురికి ప్రశంసాపత్రాలపాటు బహుమతులు ఇస్తామని ప్రకటించారు. ఇంటి స్థలం ఉన్న ట్రాన్స్ జెండర్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో డీడబ్ల్యూవో నరసింహారావు, సీడీపీవోలు రూప, శ్రీవాణి, శ్రీజ, పారిజాత, నిర్మల, కిరణ్మయి, సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.