వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి : కలెక్టర్​ క్రాంతి

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి : కలెక్టర్​ క్రాంతి

రాయికోడ్​ (కోహిర్​), వెలుగు:  వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కోహీర్ మండల కేంద్రంతో పాటు నాగిరెడ్డిపల్లి , దిగ్వాల్ గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులపై ఫైర్​ అయ్యారు. చెత్తను  కాల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. 

పెండింగ్​లో ఉన్న మిషన్​ భగీరథ పైప్​లైన్లు పూర్తి చేసి నీటి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం నాగిరెడ్డిపల్లి ప్రాథమిక, ఉన్నత స్కూల్స్​ను తనిఖీ చేశారు. స్టూడెంట్స్​తో ముచ్చటిస్తూ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారని అడిగారు. కలెక్టర్ ​వెంట ఆర్డీవో రాజు, మండల ప్రత్యేక అధికారి జంగారెడ్డి, తహసీల్దార్ బాల శంకర్, ఎంపీడీవో భారతి,  మిషన్ భగీరథ ఇంజనీర్లు,   సంబంధిత అధికారులు పాల్గొన్నారు.