
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో యూరియా, విత్తనాల కొరత లేదని నిజామాబాద్ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం డిచ్పల్లి మండలం కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్ట్రర్, ఇన్వాయిస్బుక్, బిల్ బుక్, సీడ్ బ్యాగ్స్పై లాట్ నంబర్లు, ఎంఆర్పీ రేట్, బ్యాచ్ నంబర్లతో పాటు గడువు తేదీలను పరిశీలించారు. స్టాక్ రిజిస్ర్టర్, ఈపాస్ వివరాలు ఒకేలా ఉండాలన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు సీడ్, యూరియా అమ్మకాలను పర్యవేక్షించాలని, నకిలీ విత్తనాల అమ్మకాలపై నిఘా పెట్టాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, తహసీల్దార్ సతీశ్రెడ్డి, ఏవో సుధామాధురి తదితరులు ఉన్నారు.
15,834 ఇండ్లు ఇచ్చాం..
జిల్లాకు 19,490 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించగా, ఇప్పటివరకు 15,834 మందికి మంజూరు పత్రాలు అందించామని, 7,181 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వివరాలు తెలిపారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ వికాస్మీనా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక కమిషనర్ దిలీప్కుమార్, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు.