వనమహోత్సవంపై ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

వనమహోత్సవంపై ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్,  వెలుగు : వనమహోత్సవంపై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. శనివారం  ఆయా శాఖలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు.  మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించాలని, ఇది వరకు నాటిన మొక్కలు చనిపోతే కొత్తవి నాటాలన్నారు.  సీజనల్​ వ్యాధుల నివారణకు ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని, దోమల ఆవాసాలు గుర్తించి ఫాగింగ్ చేయాలన్నారు. మురుగునీటిలో ఆయిల్ బాల్స్, గంబూషియా చేపపిల్లలు వేయాలన్నారు.

డెంగ్యూ, మలేరియాపై అలర్ట్​గా ఉండాలని, పాజిటివ్​ కేసులు ఎక్కడ నమోదైనా ర్యాపిడ్ యాక్షన్​ టీంతో పరిసర ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ఎల్ఆర్ఎస్​ రాయితీ అమలులో ఉన్న విషయాన్ని ప్రచారం చేయాలని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పురోగతిని నిరంతరం సమీక్షించాలన్నారు. ప్రతి లబ్ధిదారు ఇంటి పని మొదలుపెట్టేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ఫారెస్ట్​ ఆఫీసర్ వికాస్​మీనా, డీఆర్డీవో సాయాగౌడ్​, నగర పాలక కమిషనర్ దిలీప్​కుమార్, డీఎంహెచ్​వో రాజశ్రీ, హౌసింగ్ ఆఫీసర్ నివర్తి, డీసీవో శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు. ..