
నిజామాబాద్, వెలుగు : వనమహోత్సవంపై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయా శాఖలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించాలని, ఇది వరకు నాటిన మొక్కలు చనిపోతే కొత్తవి నాటాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని, దోమల ఆవాసాలు గుర్తించి ఫాగింగ్ చేయాలన్నారు. మురుగునీటిలో ఆయిల్ బాల్స్, గంబూషియా చేపపిల్లలు వేయాలన్నారు.
డెంగ్యూ, మలేరియాపై అలర్ట్గా ఉండాలని, పాజిటివ్ కేసులు ఎక్కడ నమోదైనా ర్యాపిడ్ యాక్షన్ టీంతో పరిసర ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీ అమలులో ఉన్న విషయాన్ని ప్రచారం చేయాలని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పురోగతిని నిరంతరం సమీక్షించాలన్నారు. ప్రతి లబ్ధిదారు ఇంటి పని మొదలుపెట్టేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ఫారెస్ట్ ఆఫీసర్ వికాస్మీనా, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక కమిషనర్ దిలీప్కుమార్, డీఎంహెచ్వో రాజశ్రీ, హౌసింగ్ ఆఫీసర్ నివర్తి, డీసీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ..