ప్రియురాలిని చంపిన ప్రియుడికి ఉరిశిక్ష

ప్రియురాలిని చంపిన ప్రియుడికి ఉరిశిక్ష

గువాహటి : ఆమె 2015లో ఇంటర్ స్టేట్ ఫస్ట్ విద్యార్థిని. చక్కగా చదువుకుంటున్న ఆ యువతిని ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుడు వెంటపడ్డాడు. ఆ యువతి కూడా ప్రేమించేలా చేసుకున్నాడు. చివరకు పెళ్లి విషయంలో గొడవపడ్డ ఆ యువకుడు ఆమెను హత్య చేశాడు. 2017లో జరిగిన ఈ ఖేసుకు సంబంధించి శనివారం గువాహటి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తీర్పు చెప్పింది. హత్య చేసిన యువకుడికి ఉరిశిక్ష, అతడికి సహకరించిన తల్లి, సోదరికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

వివరాలు ఇలా ఉన్నాయి..

గువాహటికి చెందిర శ్వేత అగర్వాల్‌,  గోవింద్‌ సింఘాల్‌ ప్రేమించుకున్నారు. పెళ్లి విషయంపై తప్పించుకు తిరుగుతున్న గోవింద్ ఇంటికి 2017, డిసెంబర్‌ 4న యువతి వెళ్లింది. మ్యారేజ్ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం మొదలైంది. దీంతో గోవింద్‌ శ్వేత తలను గోడకేసి బాదాడు.

తలకు బలమైన గాయమవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తల్లి, సోదరి సాయంతో గోవింద్‌ శ్వేతపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేశారు. తర్వాత సూసైడ్ గా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు శ్వేత హత్యకు గురైనట్టు తేల్చారు. ఆ ముగ్గురిపై మర్డర్‌ కేసు నమోదు చేశారు. నేడు కోర్టు వారిని దోషులుగా తేలుస్తు తీర్పు చెప్పింది.