కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెంపు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెంపు

న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోగ్రాముల గ్యాస్‌‌ సిలిండర్‌‌ ధర పెరిగింది. మార్చి 1 నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.25 ధరను పెంచాయి. ధర పెంపుతో దీని ధర ఢిల్లీలో రూ.1,769.50 నుంచి రూ.25.50 పెరిగి రూ.1,795కు చేరుకుంది. ముంబైలో  రూ.1749, చెన్నైలో రూ.1960, కోల్ కతాలో రూ.1911 అయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్  ధరను పెంచడం ఈ ఏడాదిలో  ఇది రెండో సారి. 

అంతకు ముందు ఫిబ్రవరి 1న సిలిండర్ ధరను రూ.14 పెంచాయి. ఇండ్లలో వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పులేదు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు  గత నెలలోని సగటు అంతర్జాతీయ ధర ఆధారంగా ప్రతి నెల ఒకటో తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి.